ప్రస్తుతం దేశవ్యాప్తంగానే ఎక్కడ చూసినా కూడా తాజాగా అంబానీ( Ambani ) ఇంట్లో జరిగిన పెళ్లి గురించి చర్చించుకుంటున్నారు.ఈ పెళ్లికి అంబానీ దాదాపు 5వేల కోట్ల ఖర్చు పెట్టిన విషయం తెలిసిందే.
అయితే ఈ పెళ్లి వేడుకలు ఇంకా ముగియలేదు.ఈ పెళ్లి వేడుకలకు టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ సెలబ్రిటీలతో పాటు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు హాజరైన విషయం తెలిసిందే.
ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అంతేకాకుండా అంబానీ ఇంట పెళ్లి వేడుకలలో జరిగిన వింతలు విడురాలు చర్చనియాంశంగా మారాయి.
కొడుకు పెళ్లి కోసం అంబానీ ఏకంగా 5000 కోట్లు ఖర్చు చేస్తుండడం వింతగా ఉందని పలువురు వాదిస్తుంటే, ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్లు అంతా అంబానీ పెళ్లికి విచ్చేసి రెడ్ కార్పెట్ ఈవెంట్లలో ప్రదర్శనలు ఇస్తుండడం మరింత విచిత్రంగా కనిపిస్తోంది.అనంత్ అంబానీ – రాధిక మర్చంట్( Anant Ambani – Radhika Marchant ) శుక్రవారం రాత్రి వివాహం చేసుకోగా ఈ వేడుకకు ప్రపంచ కుభేరులు హాజరయ్యారు.చాలా మంది సినీ రాజకీయ రంగ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు ఈ పెళ్లికి హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు.అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, సచిన్ టెండూల్కర్ లను ఒకే ఫ్రేమ్లో చూడటం కోసం అభిమానులు పోటీపడుతున్నారు.
రజనీకాంత్ ను( Rajinikanth ) కలిసిన తర్వాత బిగ్బి సచిన్ ను కలిసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
ఈ వీడియో లేదా ఫోటో వింతైనది కాదు.దీనిలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్( Sachin Tendulkar ) బిగ్ బి అమితాబ్ని( Amitabh Bachchan ) చూసిన వెంటనే ఆయన పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.కానీ బచ్చన్, సచిన్ ని ఆపి బదులుగా తన చేయి పట్టుకున్నారు.
ఇంతలో అభిషేక్ బచ్చన్ కూడా అక్కడికి వచ్చారు.అతడు సచిన్ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
బచ్చన్ తో పాటు అతడి కుటుంబం మొత్తం కనిపించింది.బచ్చన్ మనవళ్లు నవ్య నంద, అగస్త్య నంద కూడా ఉన్నారు.
సచిన్తో అగస్త్య కరచాలనం చేస్తున్నప్పుడు నవ్య కూడా నమస్తే అని పలకరించడం కనిపించింది.ముఖ్యంగా సచిన్ తనకంటే వయసులో పెద్ద అయిన అమితాబ్ కి పాద నమస్కారాలు చేయడం, దానికి అమితాబ్ అనునయించిన వీడియో ఇంటర్నెట్ లో హృదయాలను గెలుచుకుంది.
ఈ వీడియో గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు కూడా జరుగుతున్నాయి.