ఉదయం లేవగానే వేడి వేడి టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది.టీతోనే రోజును ప్రారంభించేవారు కూడా ఎందరో ఉన్నారు.
అయితే ఇకపై నార్మల్ టీ కాకుండా బాదం టీని తాగడం అలవాటు చేసుకోండి.నార్మల్ టీ కంటే బాదం టీ చాలా రుచిగా ఉంటుంది.
పైగా ఆరోగ్యాన్ని బోలెడన్ని ప్రయోజనాలను అందిస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం బాదం టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అసలు బాదం టీని తాగడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.
ముందుగా మిక్సీ జార్లో ఐదు నుండి ఎనిమిది బాదం పప్పులను వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ పాలు పోయాలి.
పాలు కాస్త హీట్ అవ్వగానే అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పొడి వేసి రెండు నుంచి నాలుగు నిమిషాల పాటు మరిగించి.ఫిల్టర్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ పై మరో గిన్నెను పెట్టుకుని కప్పు వాటర్, వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్, మూడు టేబుల్ స్పూన్ల బౌన్ షుగర్, హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి మరిగించాలి.చివరిగా అందులో ఫిల్టర్ చేసి పెట్టుకున్న బాదం పాలను పోసి.
ఐదు నిమిషాల పాటు హీట్ చేసుకుని వడబోస్తే సూపర్ టేస్టీ అండ్ హెల్తీ బాదం టీ సిద్ధమైనట్లే.
ఒక కప్పు చప్పున బాదం టీ రెగ్యులర్గా తీసుకుంటే.మెదడు చురుగ్గా పని చేస్తుంది.ఒత్తిడి, డిప్రెషన్, తలనొప్పి, ఆందోళన వంటి సమస్యలు పరార్ అవుతాయి.
గుండె ఆరోగ్యవంతంగా మారుతుంది.ఎముకలు దృఢంగా తయారవుతాయి.
ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవుతుంది.అలాగే బాదం టీని డైట్లో చేర్చుకోవడం వల్ల అతి ఆకలి దూరం అవుతుంది.
వెయిట్ లాస్ అవుతారు.జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
మరియు వృద్ధాప్య లక్షణాలు దరి దాపుల్లోకి రాకుండా కూడా ఉంటాయి.