నంద్యాల ఘటనపై రియాక్ట్ అయిన యాంకర్ రష్మీ.. తప్పించుకోలేరు అంటూ పోస్ట్?

నంద్యాల( Nandyala ) లో మూడవ తరగతి చిన్నారిపై ఏడవ తరగతి అబ్బాయిలు అఘాయిత్యానికి పాల్పడి ఆ చిన్నారిని ఘోరంగా చంపేసి శవం కూడా కనపడకుండా చేసిన ఘటన అందరిని చాలా ఆందోళనకు గురిచేస్తుంది.ఇలా మూడో తరగతి అమ్మాయిపై ఏడో తరగతి అబ్బాయిలు ఆఘాయిత్యానికి పాల్పడ్డారనే విషయం తెలియడంతో మన సమాజం ఎలాంటి దారుణమైన పరిస్థితులలో ఉందో స్పష్టంగా అర్థమవుతుంది.

 Anchor Rashmi React On Nandyala Minor Girl Issue Details,nandyala,pawan Kalyan,r-TeluguStop.com

అయితే ఈ ఘటనపై సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఒక మైనర్ బాలికపై( Minor Girl ) అఘాయిత్యం జరగడం చాలా బాధాకరం అయితే ఆ అఘాయిత్యానికి పాల్పడిన వారు కూడా మైనర్ కావడమే బాధాకరం అంటూ ఈయన ఎమోషనల్ కామెంట్స్ చేశారు అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై రష్మీ( Rashmi ) స్పందించారు.చిన్నపిల్లలు పెద్ద వారు చేసే క్రైమ్ చేస్తుంటే పెద్దవారికి పడే శిక్ష చిన్న పిల్లలకు కూడా పడాలని ఈమె గట్టిగా తన గళం వినిపించారు.ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కూడా ఈమె స్పందించారు.

పవన్ మాటలను రష్మి మరోలా అర్థం చేసుకున్నారని తెలుస్తుంది.చిన్నపిల్లలు కాబట్టే వారికి శిక్ష తగ్గించాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ మాట్లాడారని భావించిన రష్మీ ఈ ఘటనపై స్పందిస్తూ.వాళ్లు రేప్ చేసే స్థాయికి వెళ్లారు.ఆలోచించారు అంటే కచ్చితంగా మైనర్లు కానట్టే.మైనర్లు అనే సాకుతో వారిని వదిలేయకండి.కచ్చితంగా కఠినంగా శిక్షించండి ఈ శిక్ష నుంచి వారు తప్పించుకో కూడదు అంటూ ఈమె చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

ఇక రష్మి కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె బుల్లితెరపై కొనసాగుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube