త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ సమంత నటించిన అఆ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతూ విజయపథంలో దూసుకుపోతుంది.ఈ సినిమాకి ప్రశంసలు దక్కితే, త్రివిక్రమ్ కి మాత్రం విమర్శలు దక్కుతున్నాయి.
అందుకు కారణం ఈ చిత్ర కథ పూర్తిగా యద్దనపూడి సులోచన రాణి రాసిన “మీనా ” అనే నవలను పోలి ఉండటమే.ఇదే నవలను ఆధారంగా చేసుకొని “మీనా” అనే పేరుతోనే 1973 కృష్ణ విజయనిర్మల కాంబినేషన్లో సినిమా వచ్చింది.
అయితే ఆ సినిమా కోసం రచయిత్రిని సంప్రదించి హక్కులు తీసుకున్నారు.
ఇప్పుడు అదే కథను త్రివిక్రమ్ కాపి కొట్టారని, నవల హక్కులు తీసుకోకుండా, రచయిత్రికి సినిమాలో క్రెడిట్ ఇవ్వకుండా, త్రివిక్రమ్ లాంటి పేరున్న దర్శకుడు ఇలా కథను దొంగిలించడం ఏమాత్రం బాగాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
త్రివిక్రమ్ – సులోచన రాణి చాలాసార్లు కలుసుకున్నప్పటికి , ఎప్పుడు కూడా హక్కుల గురించి మాట్లాడలేదని టాక్.
ఈ విషయంపై మీనా రచయిత్రి సులోచన రాణి తీవ్ర నిరాశను వ్యక్తపరిచారని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీనిపై త్రివిక్రమ్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికర విషయంగా మారింది.