దారుణం : పెట్రోల్ పోసి ... నిప్పంటించి

పట్టపగలు అందరూ చూస్తుండగా ఓ దారుణ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.విజయవాడలోని గవర్నర్ పేట సమీపంలో శుక్రవారం దేవరపల్లి గగారిన్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించారు.

 Man Set Fire Vijayawada Broad Daylight-TeluguStop.com

ఫైనాన్స్ వ్యాపారులతో వివాదమే ఈ ఘటనకు కారణంగా .పోలీసులు భావిస్తున్నారు.దాడిలో తీవ్రంగా గాయపడిన గగారిన్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.బాధితుడికి 90 శాతం పైగా శరీరం కాలిందనై… 48 గంటలు గడిస్తేగాని ఏమీ చెప్పలేమని డాక్టర్‌ రామారావు తెలిపారు.

ఉదరభాగం నుంచి క్రిందకు ఎక్కువ శాతం శరీరం కాలిందన్నారు.ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.

-->

ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని నార్త్ ఏసీపీ రమణ మూర్తి అన్నారు.ఇద్దరు దుండగులు పెట్రోల్‌ పోసి తగులబెట్టారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.‘స్థానికులు స్పందించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.ప్రాణం పోతోంది కాపాడమని, ఆస్పత్రికి తీసుకెళ్లమని ధీనంగా అడిగాడు.ఆటోలో ఎక్కించుకుని ఆస్పత్రికి తరలించారు’ అని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.అయితే… తనపై పెట్రోలు పోసి నిప్పంటించింది మాదాల సురేశ్‌, మాదాల సుధాకర్‌ అని చెప్పినట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube