వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఉప్పెన సినిమా ఫిబ్రవరి 12వ తేదీన విడుదలై పాజిటివ్ టాక్ తో ఊహించని స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఉప్పెన సినిమాను చూసి ప్రశంసించారు.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఉప్పెన సినిమాను చూసి ఆ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఉప్పెన సినిమా క్లాసిక్ అని మహేష్ బాబు పేర్కొన్నారు.
ఒక్క మాటలో ఉప్పెన సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా క్లాసిక్ అని ఉప్పెన మూవీ దర్శకుడు బుచ్చిబాబు సానా అరుదైన కాలాతీతమైన మూవీని తెరకెక్కించారని మహేష్ అన్నారు.ఉప్పెన మూవీ గురించి ఈ విధంగా చెప్పడానికి తనకు ఎంతో గర్వంగా ఉందని మహేష్ పేర్కొన్నారు.
మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ఎంతో ఇంపార్టెంట్ అని ఉప్పెన మూవీలో మ్యూజిక్ స్టోరీతో పోటీ పడే విధంగా ఉందని పేర్కొన్నారు.
ఉప్పెన మూవీలో హీరోహీరోయిన్లుగా నటించిన వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి అద్భుతంగా నటించారని హీరోహీరోయిన్ల నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని మహేష్ అన్నారు.ఉప్పెన, కృతి రియల్ స్టార్స్ అని మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ ఉప్పెన మూవీని నిర్మించినందుకు హ్యాట్సాఫ్ చెబుతున్నానని మహేష్ అన్నారు.ఉప్పెన మూవీ కోసం శ్రమించిన టీమ్ ను చూసి గర్వపడుతున్నానని తెలిపారు.
మరోవైపు మహేష్ బాబు సర్కార్ వారి పాట మూవీ షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.
మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తుండగా 2022 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.త్వరలో గోవాలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని సమాచారం.
ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు నటించనున్నారు.