సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో అదిరిపోయే సక్సెస్ను అందుకున్నాడు.ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయాల్సి ఉంది.
కానీ అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.ఇక గీతా గోవిందం వంటి బ్లాక్బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ పరశురాంతో తన నెక్ట్స్ మూవీ ఉంటుందని మహేష్ అనౌన్స్ చేశాడు.
అయితే ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ ఎవరనే అంశంపై గతకొద్ది రోజులుగా పెద్ద చర్చ నడుస్తోంది.చాలా మంది పేర్లు వినిపించినా, చివరకు ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్గా ఉంటుందనే వార్త పెద్దగా చక్కర్లు కొట్టింది.
కానీ ఈ వార్తలో కూడా ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది.మహేష్ సరసన ‘భరత్ అనే నేను’ చిత్రంలో నటించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీనే మరోసారి హీరోయిన్గా తీసుకోవాలని మహేష్ ఆలోచిస్తున్నాడట.
ఈ మేరకు చిత్ర యూనిట్కు ఆయన కియారా పేరును రికమెండ్ చేయగా, వారు ఆమెతో ఒప్పందం కుదుర్చుకునే పనిలో పడ్డారట.అయితే ఈ సినిమాలో హీరోయిన్గా కియారా చేస్తుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్గా మిగిలింది.