ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుపై టీఎస్ హైకోర్టులో విచారణ

తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది.సిట్, బీజేపీ దాఖలు చేసిన రెండు పిటిషన్లను విచారించింది.

 Inquiry On Mlas' Temptation Case In Ts High Court-TeluguStop.com

ఈ క్రమంలో సిట్ నోటీసులను రద్దు చేయలేమని కోర్టు తెలిపింది.బీఎల్ సంతోష్, శ్రీనివాస్ లకు 41 (ఏ) సీఆర్పీసీ నోటీసులు ఇవ్వడం మీడియాకు ఎలా లీక్ అవుతున్నాయని న్యాయస్థానం ప్రశ్నించింది.

బీజేపీ అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం… సిట్ దర్యాప్తు గోప్యంగా ఉంచాలని సూచించింది.అదేవిధంగా సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగాలని హైకోర్టు వెల్లడించింది.41 (ఏ) సీఆర్పీసీ కింద అరెస్ట్ చేయడానికి వీలు లేదని స్పష్టం చేసింది.తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అరెస్ట్ చేసేందుకు వీలు లేదని, సిట్ దర్యాప్తునకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube