పాకిస్తాన్ దురాక్రమణకి ఎదురుగా నిలిచి ఆ దేశానికి యుద్ధ ఖైదిగా చిక్కిన ఇండియన్ ఫైటర్ ఫైలట్ అభినందన్ వర్థమాన్ తన విరోచిన ప్రవర్తనతో ఇప్పుడు దేశ ప్రజలందరిని ఆకట్టుకుంటున్నాడు.దేశం యావత్తు ఇప్పుడు అతనిని ఓ హీరోగా చూస్తుంది.
దీంతో ఇప్పుడు దేశం మొత్తం అభినందన్ వెనక్కి తిరిగి రావాలని కోరుకుంటుంది.సోషల్ మీడియాలో అభినందన్ పై విశేషంగా కాంపైన్ నిర్వహిస్తూ అతనికి మద్దతుగా నిలబడుతుంది.
అభినందన్ విషయంలో పాకిస్తాన్ ఏమైనా తేడాగా ప్రవర్తిస్తే వెంటనే పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించాలని భారత్ ప్రజలు కోరుకుంటున్నారు.
అభినందన్ వర్థమాన్ ఇప్పుడు దేశంలో ఎక్కడ విన్న ఇదే పేరు వినిపిస్తుంది.
ఇక జెనీవా ఒప్పందం ప్రకారం ఒక దేశానికి యుద్ధ ఖైదీగా దొరికిన సైనికుడుని వారం రోజులలోగా తిరిగి అప్పగించాలని స్పష్టమైన నిర్ణయాలు వున్నాయి.అయితే ఈ విషయంలో ఇప్పటికే ఒప్పందాన్ని అతిక్రమించి అభినందన్ మీద బౌతిక దాడులకి పాల్పడిన పాకిస్తాన్ ఆర్మీ అతనిని అప్పగిస్తుందా లేదా ఆనే అనుమానం ఇప్పుడు దేశం యావత్తు వినిపిస్తుంది.
అయితే అభినందన్ ని విడుదల చేయకుంటే తక్షణం పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధం కావాల్సిందే అని మోడీ మాటలు బట్టి చూస్తూ వుంటే పాకిస్తాన్ కుటిల నీతికి గట్టిగా సమాధానం చెప్పడానికి సిద్దమవుతున్నారు అని అర్ధమవుతుంది.ఇక జెనీవా ఒప్పందాన్ని అతిక్రమిస్తే ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ ని ఒంటరి చేసి భారత్ ని మద్దతుగా నిలబడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.