కీర్తి సురేష్ అనగానే మన అందరికీ మహానటిగా గుర్తొస్తుంది.మహానటి సినిమా ద్వారా అలనాటి అందాల తార సావిత్రి బయోపిక్ లో నటించిన కీర్తి సురేష్ కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
ఈ సినిమాతో వచ్చిన ఫేమ్ ఈమెకు బాగా ఉపయోగ పడుతుంది.అప్పటి నుండి ఈమెకు వరుస అవకాశాలు వస్తుండడంతో ఈమె క్రేజీ హీరోయిన్ లిస్టులో చేరిపోయింది.
ప్రస్తుతం కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి‘ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమాను స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు.ఇందులో కీర్తి రైఫిల్ షూటర్ గా కనిపించ బోతుంది.
ఈ సినిమా రిలీజ్ కు కరోనా అడ్డంకిగా మారుతుంది.ఇప్పటికే పలు సార్లు ఈ సినిమా డేట్ ప్రకటించి మళ్ళీ వాయిదా వేస్తూ ఉన్నారు.
ఇది పక్కన పెడితే తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేసారు.ఈ ట్రైలర్ ఆద్యంతం అలరిస్తుంది.”మన దేశం గర్వపడేలా షూటర్స్ ను రెడీ చేయబోతున్నాను” అంటూ జగపతి బాబు చెప్పిన డైలాగ్ బాగా ఆకట్టుకుంది.ఈ ట్రైలర్ లో కీర్తి బ్యాడ్ లక్ సఖి నుండి గుడ్ లక్ సఖి గా ఎలా మారిందో తన ప్రయాణాన్ని తక్కువ షాట్స్ లో బాగా ఎలివేట్ అయ్యేలా చూపించాడు దర్శకుడు.
ఈ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.ట్రైలర్ లో ఎమోషన్ కూడా బాగా ఎలివేట్ చేయడంతో బాగా అక్కట్టుకునేలా ఉంది.ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కూడా కీలక పాత్రల్లో నటించారు.ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని యూ సర్టిఫికెట్ తెచ్చుకుని జనవరి 28న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.
దిల్ రాజు బ్యానర్ లో సుధీర్ చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాను నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్నాడు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.