ప్రతిపక్షాల కోసమే జీవో నెంబర్.1 తీసుకువచ్చారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.జీవో నెంబర్ .1 కూడా సినిమా పేర్లలా ఉందని తెలిపారు.
జీవో కొందరికే కాదు.అందరికీ వర్తించాలని చెప్పారు.ఏపీలోకి కేసీఆర్ వస్తానంటే చంద్రబాబు, జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.ఆంధ్రా ప్రయోజనాలను తాకట్టు పెట్టి పార్టీలు లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.