బిగ్ బాస్ సీజన్ 8(Bigg Boss Season 8 ) కోసం ఇప్పటినుంచి చాలా కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి విపరీతమైన కసరత్తులను చేస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశ్యం లో బిగ్ బాస్ యాజమాన్యం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో భాగంగానే కుమారి ఆంటీ ( Kumari Aunty ), బర్రె లక్క, కిరాక్ ఆర్ పి లని కంటెస్ట్ లుగా తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ ముగ్గురు కూడా రీసెంట్ టైంలో మంచి పాపులారిటి ని సంపాదించుకున్నారు.ఇక మొత్తానికైతే వీళ్ళు కనక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే హౌస్ మొత్తం దద్దరిల్లిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఇక తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రెలక్క( Barrelakka Sirisha ) భారీ బీభత్సాన్ని సృష్టించింది.
తన గెలవకపోయినా కూడా ఒక నిరుద్యోగి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ప్రతి ఒక్కరి అటెన్షన్ ను దక్కించుకుంది.ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ ని బేస్ చేసుకుని కిరాక్ ఆర్పి వైసిపి పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు( Pawan Kalyan , Chandrababu Naidu ) మీద చేస్తున్న అసత్య ప్రచారాల మీద విరుచుకుపడిన తీరు ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసింది.
అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడులకు మద్దతుగా తన మాట్లాడిన మాటలు కూడా చాలా కన్విన్సింగ్ గా ఉండడంతో ప్రతి ఒక్కరూ అతని అభిమానులుగా మారిపోయారు.ఇక ఇలాంటి సమయంలోనే అతన్ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చి బిగ్ బాస్ యాజమాన్యం భారీగా క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది… చూడాలి మరి వీళ్లతోపాటు ఇంకా బిగ్ బాస్ హౌస్ లోకి ఎలాంటి కంటెస్టెంట్స్ వస్తారు అనేది…
.