గంటా పై మరో ప్రచారం, ఏపీ రాజకీయాల్లో దుమారం

మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు పై ఇప్పుడు మరో ప్రచారం జరుగుతుంది.మొన్నటివరకు ఆయన టీడీపీ ని వీడి బీజేపీ లో చేరతారు అంటూ వార్తలు హల్ చల్ చేసిన విషయం విదితమే.

 Ganta Srinivas Comments On Cm Ys Jagan-TeluguStop.com

అయితే ఇప్పుడు తాజాగా ఆయన వైసీపీ లో చేరుతారు అన్నట్లు ప్రచారం జరుగుతుంది.ఈ వార్తల్లో ఎంత నిజం ఉందొ తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం ఈ వార్త ఏపీ రాజకీయాల్లో దుమారం గా మారింది.

ఇటీవల ఆయన టీడీపీ ని చీల్చి 15 మంది ఎమ్మెల్యేల తో కలిసి బీజేపీ లోకి వెళ్తారంటూ ప్రచారం జరుగగా, ఇప్పుడు వైసీపీ లో చేరబోతున్నారు అన్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.గతంలో పార్టీలు మారిన నేపథ్యం ఆయనకు ఉండటంతో గంటా మార్పు వార్త నిజమేనని భావించారు.

కానీ ప్రస్తుతం ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు.ఇప్పుడు తాజగా అయాన్ బీజేపీ లో కాదు వైసీపీ లో చేరబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

భీమిలి నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన అవంతి శ్రీనివాస రావు ఒకప్పుడు గంటా సన్నిహితుడు కావడం కూడా వైసీపీ కి ప్లస్.అయితే ఇటీవల వీరి మధ్య దూరం పెరిగినప్పటికీ ఒక్కప్పటి స్నేహం కారణంగా ఇప్పుడు గంటా ను వైసీపీ పార్టీ టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.

Telugu Ganta Join Bjp, Ganta Join Ycp-Telugu Political News

మొన్నటివరకు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించని సీఎం జగన్ కూడా గంటా విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.దీనితో ఆయన నిజంగా వైసీపీ లో చేరతారా లేదా అన్న విషయం ఎంతో మాత్రం ఎలాంటి స్పష్టత లేదు.అయితే ఈ విషయం పై క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube