తన తల్లి మృతి చెందడటంతో బంధు మిత్రులను పిలిచి విందు ఏర్పాటు చేశాడు.తన తల్లి ఆత్మశాంతించాలని వచ్చిన వారికి కొసరి కొసరి వడ్డించాడు.
లాక్ డౌన్ టైంలో కూడా ఏకంగా వెయ్యి మందికి పైగానే ఆ విందుకు హాజరు అయ్యారు.మామూలుగా అయితే అయిదు ఆరు వేల మంది వచ్చే వారు కాకి లాక్ డౌన్ అవ్వడంతో ఆ సంఖ్య తగ్గింది.
మార్చి 20న ఈ వింధు కార్యక్రమం జరిగింది.వింధు జరిగిన కొన్ని రోజులకు అంటే ఏప్రిల్ 2వ తారీకున ఆ వింధు నిర్వాహకుడికి కరోనా పాజిటివ్ అని వెళ్లడయ్యింది.
ఆయనకు ఆయన భార్యకు ఇద్దరికి కూడా కరోనా పాజిటివ్ అని తేలండంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు.ఇక అధికారులు ఆయన నిర్వహించిన వింధు గురించి తెలిసి మరింతగా కంగారు పడ్డారు.
ఇప్పటికే వింధుకు హాజరు అయిన వారిలో 10 మందికి కూడా కరోనా సోకిందని నిర్థారించారు.ఈ దెబ్బతో ఆ వింధు కారణంగా మొత్తం పాతిక వేల మంది పూర్తిగా క్వారెంటైన్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటూ స్థానికులు చెబుతున్నారు.
ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది.వింధు ఇచ్చిన వ్యక్తి దుబాయి వెళ్లి వచ్చాడు.విదేశాలకు వెళ్లి వచ్చిన వ్యక్తి క్వారెంటైన్లో ఉండకుండా ఇలా వింధులు ఇవ్వడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది.