చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.కుప్పం మండలం చందం గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.
ఈ ఘటనలో సుమారు 17 మందికి పైగా గాయపడ్డారు.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను సమీప ఆస్పత్రులకు తరలించారు.
కాగా వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి ప్రమాదవశాత్తు బస్సు బోల్తా పడినట్లు తెలుస్తోంది.
తమిళనాడు నుంచి కుప్పం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.