ఓ తల్లి,తన కుమార్తెను,తిరుపతిలో ఒక ఫాస్టర్ అత్యాచారం చేశాడని,సోమవారం స్పందనలో బాధితురాలి తల్లి అదనపు ఎస్పీ కి పిర్యాదు ఇవ్వడం తో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది.చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన బాధిత యువతి పోలీసులకు ఇచ్చిన పిర్యాదు వివరాలు బాధితురాలి తల్లి బుదవారం ఆసుపత్రి వద్ద మీడియా కు వివరించారు.
తిరుపతి లో ఫాస్టర్ గా ఉన్న దేవసహాయం అనే వ్యక్తికి చెందిన రెయిన్బో క్లినిక్ ప్రొడక్ట్ కంపెనీ లో మా పెద్ద కూతురు గత నెల 4వ తేదీ పనికి చేరింది.ఒక రోజు సాయంత్రం ఫాస్టర్ కార్ లో వచ్చి,సరుకు డెలివరీ ఇవ్వాలి అని తన కూతురిని రమ్మని పిలిచారు.
తరువాత రేణిగుంట సమీపం లో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
దిశ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేస్తే.
అంత పెద్ద వారితో నువ్వు పోరాడ లేవు అని, సిమ్ మార్చేసి వేరే పని చూసుకోమని పోలీసులు సలహా ఇచ్చారు.అని తెలిపారు.సోమవారం అదనపు ఎస్పీ సుప్రజ కు స్పందన కార్యక్రమం లో పిర్యాదు ఇవ్వగా.గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ కు పంపారు.
గాజుల మంఢ్యం ఎస్సై శ్రీనివాసులు కేసు నమోదు చేసి బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.బాధితురాలిని తెలుగు దేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ నియోజక వర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్ , టీఎన్ ఎస్ ఎఫ్, డీ వై ఎఫ్ ఐ నాయకులు పరామర్శించారు.
తరువాత పోలీసుల తీరు పై ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు.