దేశంలో కరోనా వైరస్ బెంబేలెతీస్తోంది.రోజుకి దాదాపు మూడు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కావటంతో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ ఇండియాలో గట్టిగా మోగే పరిస్థితి నెలకొంది.
మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో కరోనా రోగులు అనేక అవస్థలు పడుతున్నారు.బెడ్లు దొరకక ఆక్సిజన్ అందకఅనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇటువంటి తరుణంలో ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు మరియు రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే.
కాగా తాజాగా ఏపీ పారిశ్రామిక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు.
ఈ విషయాన్ని స్వయంగా ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు స్పష్టం చేశారు.స్వల్పంగా జ్వరం ఉండటంతో వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకి కొత్త పాజిటివ్ కేసులు 10000 లకి పైగా నమోదవుతున్నాయి.
దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉంటూ ఎక్కడికక్కడ కరోనా రోగులకు ఎటువంటి వైద్య సదుపాయం తక్కువ కాకుండా చర్యలు చేపడుతోంది.