తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా ఇవాళ చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.సాయంత్రం 5 గంటలకు ప్రారంభంకానున్న బహిరంగ సభకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను ఖర్గే ప్రకటించే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే.రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో దళిత, గిరిజన వర్గాలకు సంబంధించి హామీల డిక్లరేషన్ ను ప్రకటించనుంది.
ఇప్పటికే రైతు, యువ మరియు పెన్షన్ డిక్లరేషన్లను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మరిన్ని డిక్లరేషన్లను ప్రకటించనుంది.భారీ బహిరంగ సభ నేపథ్యంలో చేవెళ్లలో పార్టీ శ్రేణులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.
అదేవిధంగా సభకు భారీగా జనసమీకరణ చేస్తున్నారు.