వెండితెరపై తెలుగు, తమిళ పరిశ్రమలో మంచి కమిడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి విద్యుల్లేఖ రామన్.ఆమె నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తక్కువ సమయంలోనే కమెడియన్ గా విద్యుల్లేఖ తనదైన ముద్ర వేసుకుంది ఈ భామ.ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాల్లో కనిపిస్తూ ప్రేక్షుకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.ఇప్పడు స్టార్ కమిడియన్ జాబితాలో ఒక్కరిగా చేరారు.ఇక లావుగా బొద్దుగా కనిపించే ఈ భామ లాక్ డౌన్ సమయంలో వర్క్ అవుట్ చేసి స్లిమ్ గా కనిపించి ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చింది.
అయితే ఈ భామ రీసెంట్ గా నిడారంబరంగా నిశ్చితార్థం చేసుకొని ఆమెకు కాబోయే భర్తను పరిచయం చేశారు.తాజాగా ఆమె అమెజాన్ ప్రైమ్ లో స్టాండప్ కామెడీ షో చేస్తున్నారు.
అయితే ఈ షోను అర్జున్ కార్తికేయన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ కామెడీ షో తమిళంలో ఉంది.
ఈ షో గురించి ప్రమోట్ చేయడానికి ఆమె పలు ఇంటర్వూలు ఇచ్చారు.అయితే ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.
బ్రహ్మానందం చేసిన స్టాండప్ కామెడీ షో చూసినట్లు తెలిపారు.అంతేకాకుండా షోలో ప్రజంటేషన్ సరిగ్గా లేదంటూ తెలిపారు.
ఇక ఆ షోకి సంబంధించిన కంటెంట్ను సరిగా తీసుకోలేదన్నారు.ఆ షోకి సరిగ్గా హోంవర్క్ చేయలేదని ఆమె అన్నారు.
అయితే ఇది కేవలం స్టాండింగ్ కామెడీలోని బేసిక్ కంటెంట్ ను వారు తీసుకున్నట్లు తెలిపారు.ఈ కారణంగానే ఈ షో పెద్దగా సక్సెస్ కాలేదని ఆమె అన్నారు.
అయితే కామికిస్థాన్ తమిళ్లో షో కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది.అంతేకాకుండా ఈ షో ప్రేక్షకుల ఆకట్టుకుంటుందనే నమ్మకం ఆమెకు ఉన్నట్లు తెలియజేసింది.
ఇక బ్రహ్మానందం షోను మా షోను పోల్చి చుడొదంటూ విద్యుల్లేఖ రామన్ అన్నారు.దింతో విద్యుల్లేఖ రామన్ పై బ్రహ్మీ అభిమానులు ఫైర్ అవుతున్నారు.