అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ కెసిఆర్ ఇచ్చేస్తున్న వరాలకి అడ్డూ అదుపూ ఉండడం లేదు.ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఆయన వైఖరి ఇదే విధంగా ఉంటోంది.
కేవలం వరాలు ప్రకటించడం లో మాత్రమే కాకుండా అమలు చెయ్యడంలో కూడా జనాలకి దూకుడు కావాలి.అందుకనే ఆ విషయంలోనూ ఆయన దూకుడు ప్రదర్శిస్తున్నాడు.
యాభైవేల మందికి ఒక్కొక్కరికీ ఐదు వేల వరకూ మేలు జరిగేలా చూసారు తాజాగా.తీర్చాల్సిన డిమాండ్ లు ఎన్ని పెరుకుపోయినా వాటిని తీర్చడం లో చాలా సమయం తీస్కుంటూ ఉంటాయి ప్రభుత్వాలు.
విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తే కానీ కదలని సర్కార్లు ఉన్న ఈ దేశం లో కెసిఆర్ అడగకపోయినా ఎన్నో ఇస్తూ ఉండడం విశేషం.కాంట్రాక్ట్ – అవుట్ సోర్సింగ్ వారికి జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు కెసిఆర్.
జనవరి నుంచీ ఈ పెంపు కొనసాగుతుంది అని తెలుస్తోంది.తాజా తోఫాతో తెలంగాణ రాష్ట్రంలోని 55 వేల మంది పొరుగుసేవల సిబ్బంది జీతాలు కొంచెం అటూఇటూగా 5వేల వరకూ ఒక్కసారిగా పెరుగుతుండటం గమనార్హం.
తాజా పెంపు పుణ్యమా అని మూడు కేటగిరిలో పెరిగిన మొత్తం చూస్తే.మొదటి కేటగిరిలో పని చేసే ఉద్యోగులకు రూ.6700 – రూ.7400 మధ్య జీతం పొందే వారి జీతం ఇక రూ.12వేలు అందనుంది.ఈ రేంజ్ లో కెసిఆర్ దూకుడుని అందుకోవడం ఏ ముఖ్యమంత్రి వలనా కాదు అని కచ్చితంగా చెప్పచ్చు.