ప్రతి రోజు ఉదయం లేవగానే చాలామంది సెల్ ఫోన్ చేతిలో పట్టుకోవడం తోనే వారి దినచర్యను ప్రారంభిస్తున్నారు.ఉదయం లేచినప్పటి నుంచి వాట్సాప్ లో స్టేటస్ లు పెట్టడం, ఫోటోలను వారి స్నేహితులకు, బంధువులకు పంపిస్తూ ఎక్కువ సమయం సెల్ ఫోన్ తో కాలక్షేపం చేస్తున్నారు.
వాట్సాప్ లో కొత్త కొత్త ఫీచర్స్ రావడంతో ప్రస్తుతం ఎలాంటి విషయమైన ఫోన్లో మాట్లాడకుండా కేవలం వాట్సాప్ మెసేజ్ ద్వారా మాత్రమే అవతలివైపు వ్యక్తికి సమాచారం అందజేస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ వాడకం ఎక్కువగా ఉంది.
ఎలాంటి ముఖ్యమైన విషయాలను కూడా వాట్సాప్ లోనే పంపుతున్నారు.ఇంతకు ముందు కేవలం మెసేజ్ మాత్రమే వెళ్ళేది.
కానీ ప్రస్తుతం వాట్సాప్ నుంచి వాయిస్ కాల్స్ చేయడం, వీడియో కాల్ చేయడం వంటి కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తేవడంతో వాట్సాప్ యూజర్ల సంఖ్య మరింత పెరిగింది.వీడియో కాల్స్ ను ఉపయోగించి ఎంత దూరంలో ఉన్న బంధువులను స్నేహితులను చూస్తూ మాట్లాడటం వంటి ఈ అవకాశాన్ని వాట్సాప్ ప్ యూజర్లకు కల్పించింది.
అయితే వాట్సాప్ బిజినెస్ యాప్ ను వాడుతున్న యూజర్ల నుంచి త్వరలో కొన్ని సేవలకు చార్జెస్ వసూలు చేస్తారని ఫేస్ బుక్ సమస్థ ఒక ప్రకటనలో తెలిపింది.ఏ సేవలకు ఎంత చార్జెస్ వసూలు చేస్తారన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియదు.
అయితే ఈ చార్జెస్ ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయి అన్నవిషయం గురించి సరైన స్పష్టత రాలేదు.అయితే ఈ చార్జెస్ వసూలు చేయడం ద్వారా వచ్చే ఆదాయంతో మరి కొన్ని కొత్త ఫీచర్స్ ను యూజర్లకు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇలాంటి చార్జెస్ విధిస్తున్నట్లు ఫేస్ బుక్ ఓ ప్రకటనలో తెలియజేసింది.