బీఆర్ఎస్ పార్టీ తొలి భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని జాతీయ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే.
సభను ముందుగా ఢిల్లీలో నిర్వహించాలని పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ భావించారు.కానీ ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోనే సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఇందులో భాగంగా ఈనెల 18న ఖమ్మంలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి కేసీఆర్ హాజరుకానున్నారు.అదే రోజున ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించనున్నారని సమాచారం.
త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో సభ ద్వారా పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావులతో పాటు పలువురు నేతలతో కేసీఆర్ చర్చించారు.