నెల్లూరు టీడీపీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులపై దాడి జరిగింది.ఆయన ఇంటి బయట రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు తన కారుతో… కోటంరెడ్డి కాలుపై బలంగా ఢీకొట్టాడు.
ఈ ఘటనలో శ్రీనివాసులకి తీవ్ర గాయాలు అయ్యాయి.దీంతో వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగింది.
అనంతరం నెల్లూరు టీడీపీ క్యాడర్ ఆసుపత్రికి చేరుకుని.కోటంరెడ్డి శ్రీనివాసులను పరామర్శించడం జరిగింది.
ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించి… ఘటనకు పాల్పడిన రాజశేఖర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.కోటంరెడ్డి శ్రీనివాసులు కుమారుడు ప్రణయ్, రాజశేఖర్ రెడ్డి ఎప్పటినుండో స్నేహితులు.
చాలా రోజుల తర్వాత రాజశేఖర్ రెడ్డి ప్రణయ్ ఇంటికి వచ్చి… మద్యం మత్తులో గొడవ పడడం జరిగింది.ఈ క్రమంలో శ్రీనివాసులు కల్పించుకుని రాజశేఖర్ రెడ్డికి సర్ది చెప్పి కార్ లో కూర్చోబెట్టి.
ఇంటికి పంపించే ప్రయత్నం చేయడం జరిగింది.అయితే కారులో కూర్చున్న రాజశేఖర్ రెడ్డి ఒక్కసారిగా కారును శ్రీనివాసుల కాలు పైకి తొక్కించి . చాకచక్యంగా పారిపోయాడు.దీంతో గాయపడిన శ్రీనివాసులను కుటుంబ సభ్యులు.
ఆసుపత్రిలో జాయిన్ చేయడంతో కాలుకు ఫ్రాక్చర్ అయినట్లు.వైద్యులు తెలియజేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రాజశేఖర్ రెడ్డిని పట్టుకోవడానికి గాలిస్తున్నారు.