ప్రస్తుతం భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ఉన్నారు.అయితే 2024 తర్వాత నరేంద్ర మోదీ స్థానంలో ప్రస్తుత హోం మంత్రిగా ఉన్న అమిత్ షా ప్రధానమంత్రి అవుతారని ప్రచారం చాలా రోజులనుంచి వినిపిస్తూనే ఉంది .
ప్రస్తుతం ఉన్న బిజెపి నాయకులను పరిగణలోకి తీసుకుంటే… అమిత్ షా నే ఆ పదవికి అన్ని విధాలా అర్హుడు అనే విషయం అందరికీ తెలిసిందే.దీనిపై పార్టీ లో విస్తృతంగా గత కొంతకాలంగా చర్చ జరుగుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా బిజెపి సీఎం హిమంత్ శర్మ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను భారత ప్రధానమంత్రిగా , ప్రధాని నరేంద్ర మోదీని కేంద్ర హోంమంత్రి గాను ఆయన సంబోధించారు. ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా సభకు హాజరైన జనాలు, పార్టీ నాయకులు షాక్ అయ్యారు.
దీంతో వెంటనే మరో నేత అలెర్ట్ అయ్యారు.సీఎం అనుకోకుండా నోరుజారి మాట్లాడారని, ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని ముఖ్యమంత్రి ని సమర్థించే ప్రయత్నం చేశారు .కానీ అప్పటికే కాంగ్రెస్ తదితర పార్టీలు ఆ వీడియో ను వైరల్ చేయడంతో పాటు , బిజెపి తదుపరి ప్రధాని అభ్యర్థిగా అమిత్ షా ను ఎంచుకుంది అని, అందుకే ఆయన ఉద్దేశపూర్వకంగా ఇటువంటి వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎద్దేవా చేస్తోంది.అయితే హిమంత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఉద్దేశ్యపూర్వకంగా చేసినవి కాదు అంటూ బిజెపి నష్ట నివారణ చర్యలకు దిగినా, ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఎప్పటి నుంచో అమిత్ షా ప్రధాని అవుతారు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో , ఈ తరహా వ్యాఖ్యలు ఆ అనుమానాలకు మరింత ఊతం ఇచ్చాయి.మొత్తానికి అసెంబ్లీ లో సీఎం తికమక పడి బీజేపీ నీ, అమిత్ షా, నరేంద్ర మోదీని ఇరుకున పెట్టాడు.