ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ నీ సమర్థవంతంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కి చెందిన ఆనందయ్య నాటు వైద్యం ఎదుర్కొంటోంది అని మీడియాలో ఇటీవల వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.చావు బతుకుల్లో ఉన్న వాళ్లు సైతం ఈ మందు వేసుకోగానే.
బతకటం వంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి.ఈ క్రమంలో ఆనందయ్య మందు పై సీఎం జగన్ సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది.
చాలా వరకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న తరుణంలో మీడియాలో కొన్ని వార్తలు ఇటీవల.అనుమానాలు కలిగించే రీతిలో ప్రసారం అవుతున్న తరుణంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆనందయ్య మందు పై సంచలన కామెంట్ చేశారు.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జర్మన్ షెడ్ 30 పడకల ఆక్సిజన్ బెడ్లు ఆసుపత్రి అందుబాటులోకి తెచ్చిన తరుణంలో.మాట్లాడుతూ ఆనందయ్య మందు పై సమీక్ష సమావేశం సీఎం జగన్ ఆధ్వర్యంలో చేయడం జరిగిందని పేర్కొన్నారు.
కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని అన్నారు.కమిటీ వేయడం జరిగిందని ఆనందయ్య మందు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని.కమిటీ అధ్యయనం చేసి నివేదిక అందిస్తుందని .అప్పటివరకు ఎలాంటి అపోహలు వద్దని ప్రజలకు మంత్రి ఆళ్ల నాని సూచించారు.అదే రీతిలో ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రజలకు జాగ్రత్తలు చెప్పాల్సిన విపక్షం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందని.టీడీపీ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.