ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో సెలబ్రెటీలు అంతా ఇంట్లో ఉంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కొన్ని విషయాలు పంచుకుంటున్నారు.అంతేకాకుండా తమ ఫోటో షూట్ లతో బిజీ గా మారి ఫోటోలను బాగా షేర్ చేస్తున్నారు.
అంతేకాకుండా తమ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ స్కూల్ ఫోటో కనిపించగా అందులో ఓ హీరోయిన్ ఉంది.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా అందులో ఉన్న హీరోయిన్ అందరూ క్షణాల్లో గుర్తు పట్టేస్తున్నారు.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు టాలీవుడ్ ముద్దుగుమ్మ కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్.
తన నటనతో, అందంతో ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించింది.
అక్కడ కూడా తన నటనతో మంచి గుర్తింపు అందుకుంది.
తొలిసారిగా ప్రేమమ్ సినిమా తో మలయాళం ఇండస్ట్రీకి పరిచయం అయింది.
ఇక తెలుగులో ప్రేమమ్,అ ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాగా తొలి నటనతోనే మంచి గుర్తింపు అందుకుంది.ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఎప్పటికప్పుడు తన ఫోటోలను, ఫన్నీ వీడియోలను అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ హీరో నిఖిల్ నటిస్తున్న 18 పేజెస్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమాకు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు.మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జి ఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.