భారత్ – పాకిస్తాన్ ల మధ్య యుద్ధం ఎవరూ కోరుకోరు కానీ క్రికెట్ మ్యాచ్ ని మాత్రం కోరుకుంటారు.అది కూడా ఇంటర్నేషనల్ లీగ్ లలో తీవ్రంగా కోరుకుంటారు.
వరల్డ్ కప్ జరుగుతూ ఉన్నప్పుడు లీగ్ దశలోనో లేక సూపర్ 8 లోనో ఇండియా – పాక్ ల మధ్య మ్యాచ్ జరుగుతూ ఉన్నట్టు అయితే అభిమానుల సంతోషానికి తిరుగే లేదు.రాబోయే 19 వ తారీఖున ఇదే జరగబోతోంది.
ఇండియా పాకిస్తాన్ ల మధ్యన ఈడెన్ గార్డెన్స్ వేదిక గా మ్యాచ్ ప్రారంభం అవ్వబోతోంది.
ఈ వ్యవహారం లో ఒక స్పెషల్ అట్రాక్షన్ అందరినీ ఆకర్షించబోతోంది కూడా.
అమితాబ్ బచ్చన్ – బాలీవుడ్ మెగా స్టార్ ఈ మ్యాచ్ కి ముందర జాతీయ గీతం ఆలపించ బోతున్నారు.దీనికి బిగ్ బీ ఇప్పటికే ఓకే చెప్పారు అని బెంగాల్ క్రికెట్ సంఘం తెలిపింది.
ఈ ఏర్పాటు ని సౌరవ్ గంగూలీ సాధ్యపరిచాడు అని తెలుస్తోంది.