టాలీవుడ్ దర్శకుడు పరశురామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గత రెండు మూడు రోజులుగా డైరెక్టర్ పరుశురామ్ పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోతోంది.
అయితే డైరెక్టర్ పరశురామ్ విజయ్ దేవరకొండ తో కలిసి గీతగోవిందం సినిమాను చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు విజయ్ దేవరకొండ తో కలిసి మరో సినిమాను సిద్ధమయ్యారు పరశురామ్.
ఆ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారు.ఈ నేపథ్యంలో ఇటీవలే అధికారికంగా ప్రకటన కూడా వచ్చిన విషయం తెలిసిందే.
దిల్ రాజు, పరశురామ్, విజయ్ దేవరకొండ ముగ్గురూ కలసి ఉన్న క్రేజీ పిక్ పోస్ట్ చేస్తూ ఈ చిత్రాన్ని ప్రకటించారు.
అయితే ఈ కాంబినేషన్ గురించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ పరశురామ్, దిల్ రాజు వైఖరిపై అల్లు అరవింద్ తీవ్ర అసంతృప్తి తో ఉన్నట్లు ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి.పరశురామ్, దిల్ రాజు వైఖరిపై అల్లు అరవింద్ కుండబద్దలు కొట్టబోతున్నారు అంటూ వార్తలు వినిపించినప్పటికీ చివరి నిమిషంలో ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయింది.
పరశురామ్ తన బ్యానర్ లో సినిమా చేయాల్సింది పోయి దిల్ రాజుతో చేస్తున్నారని అల్లు అరవింద్ ఆగ్రహంతో ఊగిపోయారు.
గీత గోవిందం 2 చేసేందుకు పరశురామ్ అరవింద్ దగ్గర భారీ మొత్తంలో ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కానీ సడన్ గా విజయ్ దేవరకొండతో దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ చిత్రం చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.ఇది అల్లు అరవింద్ ఆగ్రహానికి కారణం అయ్యింది.
దీంతో మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలపై మాట్లాడాలని పరశురామ్, దిల్ రాజుపై విమర్శలు చేయాలనీ అల్లు అరవింద్ రెడీ అయ్యారట.ఈ వార్తలు కనుక నిజం అయితే సినిమా పరిశ్రమలో మరొక పెద్ద వివాదం చాలా రేగుతుందని ప్రొడ్యూసర్ గిల్డ్ అల్లు అరవింద్ ని రిక్వస్ట్ చేసి మీడియా సమావేశం జరగకుండా చేశారట.