తెలుగు సినీ నటుడు నరేష్ ఈ మధ్య తరచూ వార్తల్లో బాగా కనిపిస్తున్నాడు.ఇప్పటికే మా ఎన్నికల వ్యవహారం గురించి పలుమార్లు మీడియా ముందుకు వచ్చి కొన్ని చర్చలు చేశాడు.
ఇదిలా ఉంటే మరో వివాదంను ఎదుర్కొంటున్నాడు నరేష్.ఈ వివాదం గురించి మీడియా ముందు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు.
ఇది సినిమాకు సంబంధించిన విషయం కాదంటూ.గచ్చిబౌలిలో ఉన్న గోల్ఫ్ ఎడ్జ్ ప్రెసిడెంట్ గురించి తెలిపాడు.
అవన్నీ తమ ల్యాండ్ లో తాము కట్టుకున్న ఇళ్లని మొత్తం 487 ఫ్లాట్స్ లో 1500 మంది ఉన్నారని తెలిపాడు.బిల్లింగ్ అక్రమంగా ప్లాన్ కు విరుద్ధంగా కట్టడంతో అనుకూల ప్రమాదం ఉందని తెలిపాడు.
దీంతో అక్కడున్న ప్లాట్ల యజమానులు భయపడుతున్నారని లాక్డౌన్ లో ఎవరూ లేని సమయం చూసి ఇదివరకున్న అసోసియేషన్ లో ఎలక్షన్స్ పెట్టారని తెలిపాడు.ఇక ముగ్గురు వ్యక్తులు యజమానులపై దాడులకు దిగుతున్నారని.
సొసైటీ ఫండ్ మొత్తాన్ని పక్కదారి పట్టిస్తున్నారని తెలిపాడు.
తనకు కూడా మెయిల్స్ పంపిస్తూ బెదిరిస్తున్నారని ఏ కాంట్రవర్సి కి పోను అంటూ తన దగ్గరికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని తెలిపాడు.ఇక ఈ విషయం గురించి జిహెచ్ఎంసి కి తెలిపామని వాళ్లు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని తెలిపాడు.ఇక B2714 లో కన్నడ నటుడు సుదీప్ ఉన్నాడని, ఆ ప్లాటు కూడా ప్లాన్ కు విరుద్ధంగా కడుతున్నారని తెలిపాడు.
తను కూడా ఈ అక్రమ కట్టడాలు వెనుక సుదీప్ ఉండటం బాధాకరమని తెలిపాడు.
ఇదంతా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని.ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రశ్నిస్తే హింసలు పెడుతున్నారని తెలిపాడు.తాలిబన్ లా ఒక బ్లాక్ ను తమ ఆధీనంలోకి అక్రమంగా తీసుకొని యజమానులను హింసిస్తున్నారు అని వీరిని అడ్డుకోవడానికి ఎవరు వచ్చినా కూడా వారిపై దాడులు చేస్తున్నారని తెలిపాడు నరేష్.