ప్రస్తుతం తెలుగులో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్ళ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నారు.ఇక తమిళ్ సినిమా డైరెక్టర్లు కూడా మన తెలుగు హీరోలతో సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే తమిళం లో స్టార్ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజు( Lokesh Kanagaraj ) తెలుగు హీరోల మీద ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది.ఇక ఆయన రామ్ చరణ్ తో( Ram Charan ) ఒక సినిమా చేయాలని ఆయనకు ఒక సోషల్ ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఒక కథను కూడా వినిపించారట.
మరి రామ్ చరణ్ దానికి ఎలా స్పందించాడనే విషయం పక్కన పెడితే ఈమధ్య మన తెలుగు హీరోలతో యావత్ ఇండియన్ డైరెక్టర్లందరూ సినిమా చేయాలని చూస్తున్నారు.దానికి కారణం మన తెలుగు హీరోల క్రేజ్ అనేది భారీగా పెరిగడమే అని చెప్పవచ్చు.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లతో ఎక్కువ మంది సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు…
ఇక ఎప్పుడైతే బాహుబలి సినిమా ( Baahubali ) వచ్చిందో అప్పటినుంచి మన సినిమాల చరిత్ర అనేది మారిపోయింది.ఒకసారి ఒక సినిమా వచ్చి ఒక బెంచ్ మార్కును సెట్ చేసిందంటే తర్వాత సినిమాలు కూడా ఆ పాటర్న్ లోనే ముందుకు సాగుతూ ఉంటాయి.బాలీవుడ్ జనాలు కూడా మన హీరోల సినిమాల కోసం ఎదురు చూస్తున్నారంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ( Tollywood ) అనేది ఎంత ప్రత్యేకంగా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు.ఇక తొందర్లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించబోతుంది అనేది మాత్రం వాస్తవం… ఇక రాబోయే రోజుల్లో మన తెలుగు హీరోల సినిమాలు మరింత భారీ వసూళ్లను రాబట్టే అవకాశాలు కూడా ఉన్నాయి…
.