తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో ఎంపిక అయిన కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలను ఆయన అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ.పదేళ్లు అధికారంలో ఉంటానని తెలిపారు.
అవకాశం ఇస్తే ఇంకో పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని చెప్పారు.అయితే అధికారంలోకి వస్తానని కేసీఆర్( KCR ) అంటున్నారన్న రేవంత్ రెడ్డి తాను ఇక్కడే ఉంటానని పేర్కొన్నారు.పదేళ్ల పాలనలో కేసీఆర్ చేయలేని పనులను తాము 60 రోజుల్లోనే చేశామన్నారు.ఈ క్రమంలోనే అసెంబ్లీకి రానివారికి అధికారం ఎందుకని ప్రశ్నించారు.