రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆలయ అధికారులతో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చైర్మన్ ఛాంబర్ లో భేటీ అయ్యారు.దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
రాబోవు మహాశివరాత్రి జాతర సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారో అధికారులను అడిగారు.
సమ్మక్క సారలమ్మ ను దర్శించుకునే ముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీలో భాగంగా వస్తుందని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఆది, సోమ, శుక్రవారాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.