రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి దళిత నాయకులు మర్యాదపూర్వకంగా మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ ను గురువారం రోజున కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు, వల్లంపట్ల దళిత కాలనీ మహిళలు ఎమ్మెల్యేను కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల సాయం చేస్తుందని పేర్కొన్నారు.
రసమయన్న మా మద్దతు మీకే…మూడవ సారి మానకొండూర్ ఎమ్మెల్యే గా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అనంతగిరి, వల్లంపట్ల దళిత నాయకులు, మహిళలు అన్నారు