టాప్ గేర్ ప్రచారం షురూ చేసిన కాంగ్రెస్!

జరగబోతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్కు( Congress party ) అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో ఆ పార్టీ అధిష్టానం పూర్తిస్థాయి ప్రచారానికి తెర తీసింది .తెలంగాణ కేంద్రంగా తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బస్సు యాత్రలు , బహిరంగ యాత్రలకు కాంగ్రెస్ అతిరధ మహారధులు అందరూ తరలివస్తునట్టుగా తెలుస్తుంది .

 Congress Started The Top Gear Campaign! , Congress , Campaign, Rahul Gandhi,-TeluguStop.com

రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు బహిరంగ సభలోను ,పాదయాత్రలోనూ పాల్గొని రైతులు , మహిళల ,యువత సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది.ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలంపేట గ్రామంలో రామప్ప ఆలయం వద్ద బస్సు యాత్రకు ప్రారంభించనున్న రాహుల్ సోనియాలు ( Sonia Gandhi )అక్కడ ఏర్పాటు చేయబోయే తొలి బహిరంగ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో పై ప్రకటన చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

Telugu Congress, Priyanka Gandhi, Rahul Gandhi, Sonia Gandhi, Telangana-Telugu P

అంతేకాకుండా తెలంగాణలో భారీ ఎత్తున ఉన్న రైతాంగం సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర తెలంగాణను పట్టిపీడిస్తున్న గల్ఫ్ సమస్యలు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పై ప్రత్యేక హామీలు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది.నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామనే హామీని రాహుల్ గాంధీ ద్వారా టీ కాంగ్రెస్ ప్రకటింపచేయబోతున్నట్టుగా తెలుస్తుంది.తద్వారా ఆ ప్రాంత రైతులలో స్పందన వస్తుందని అది కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుంది అన్న అంచనాలు ఉన్నాయి.

Telugu Congress, Priyanka Gandhi, Rahul Gandhi, Sonia Gandhi, Telangana-Telugu P

అలాగే ఆర్మూర్, నిజామాబాద్ , బోధన్ చెరుకు రైతు సంఘాలతో కూడా రాహుల్( Rahul gandhi ) ప్రత్యేకంగా సమావేశం అవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది అంతే కాకుండా ములుగు, పెద్దపల్లి, ఆర్మూర్లలో బహిరంగ సభలను మందని, కరీంనగర్ ,భూపాల్ పల్లి లో పాదయాత్రల లోనూ ఈ అగ్ర నేతలు పాల్గొన బోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి . రాహుల్ ప్రియాంకల పర్యటనలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తుంది.ఈసారి కాంగ్రెస్కు అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండడంతో ఎటు పరిస్థితుల్లోనూ అలసత్వం ప్రదర్శించకూడదని పూర్తిస్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే కాంగ్రెస్ తన శ్రేణులకు దిశా నిర్దేశం చేసింది.

కాంగ్రెస్ గెలవ బోయే రాష్ట్రాల్లో ఒకటిగా ప్రచారం జరుగుతున్న తెలంగాణలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టు వీడకూడదనే పట్టుదలను కాంగ్రెస్ అధిష్టానం కూడా ప్రదర్శిస్తుంది .దాంతో రాష్ట్ర నేతలకు పూర్తి స్తాయిలో అందుబాటులో ఉండి పూర్తిస్థాయిలో ప్రచారం చేయాలని ఎక్కడికి అక్కడ రైతులను మహిళలను యువతను ఆకట్టుకునే హామీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube