తెలంగాణలోని నాయకుల నుంచి వస్తున్న పలు విమర్శలపై సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు స్పందించారు.ఈ మేరకు త్వరలోనే తనపై వచ్చిన ప్రతి విమర్శకు సమాధానం చెప్తానని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రాబోతుందని కేవీపీ ధీమా వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో అపోహాలు సృష్టిస్తోందని ఆరోపించారు.
అటువంటి పార్టీ వలలో పడి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరే విధంగా వ్యవహారించవద్దని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.తనలో నరనరాన కాంగ్రెస్ రక్తమే ప్రవహిస్తుందన్నారు.
ఈ క్రమంలోనే సొంత పార్టీపై కానీ, మరో పార్టీపై కానీ విమర్శలు చేస్తూ కాలం గడిపేడయం సరికాదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చురకలు అంటించారని తెలుస్తోంది.