రేపు విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా మెంటాడ మండలం చినమేడపల్లికి వెళ్లనున్న ఆయన కేంద్రీయ గిరిజన యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు.

 Cm Jagan's Visit To Vizianagaram District Tomorrow-TeluguStop.com

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పాల్గొననున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.అనంతరం దత్తిరాజేరు మండలం మరడాంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు.

కాగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వ విద్యాలయం నిర్మాణానికి ప్రభుత్వం సన్నద్ధమైన సంగతి తెలిసిందే.ఈ యూనివర్సిటీలో 17 కోర్సులను ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది.

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులతో పాటు పరిశోధనల కోసం కూడా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారని సమాచారం.మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube