నా జోలికి వస్తే ఊరుకోను..: ఎమ్మెల్యే మైనంపల్లి

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను ఎవరి జోలికి వెళ్లనన్న ఆయన తన జోలికి వస్తే ఊరుకోనని స్పష్టం చేశారు.

 I Will Not Stand Still If It Comes To Me..: Mla Mainampally-TeluguStop.com

తిరుమల శ్రీవారిని ఇవాళ మరోసారి దర్శించుకున్న మైనంపల్లి తరువాత హైదరాబాద్ కు తిరుగు పయనం కానున్నారు.హైదరాబాద్ కు వెళ్లిన తరువాత ముఖ్య అనుచరులతో సమావేశం అయి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు.

తాను హార్డ్ వర్కర్ ని అన్న మైనంపల్లి తన కుమారుడు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని తెలిపారు.తిరుమలలో తన అభిప్రాయాలను చెప్పుకోవడంలో తప్పులేదన్నారు.

ఈ క్రమంలోనే తాను నిన్న పార్టీ గురించి మాట్లాడలేదని, ఈ రోజు కూడా మాట్లాడనని చెప్పారు.మెదక్ నియోజకవర్గం తనకు రాజకీయ భిక్ష పెట్టిందన్న మైనంపల్లి మల్కాజ్ గిరి ప్రజలు తనను ఊహించని విధంగా ఆదరించారని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే రెండు నియోజకవర్గాల్లోని తన కార్యకర్తలతో, అనుచరులతో చర్చించాక తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube