రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సైగా ప్రేమ్ దీప్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన ప్రేమ్ దీప్ జిల్లా షీ టీంలో పనిచేసి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో చార్జ్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు వెనువెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా పోలీస్ స్టేషన్ వచ్చి సంప్రదించాలని ఎస్సై ప్రేమ్ దీప్ తెలిపారు.