మన్యం జిల్లా తాలాడలో ఏనుగుల బీభత్సం

పార్వతీపురం మన్యం జిల్లా తాలాడలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.గ్రామానికి చెందిన కొందరిపై గజరాజులు దాడి చేశాయి.

 Elephant Disaster In Talada, Manyam District-TeluguStop.com

ఏనుగుల దాడిలో గోపిశెట్టి చిన్నారావు, పార్వతి, జయలక్ష్మీలు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

కాగా చిన్నారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.మరోవైపు ఏనుగుల దాడి నేపథ్యంలో సమీప గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

పది రోజుల్లోనే రెండు సార్లు గ్రామంపై దాడి చేశాయని వాపోతున్నారు.ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube