బాలీవుడ్ వివాదాస్పద క్రిటిక్ కెఆర్కే గురించి మనందరికి తెలిసిందే.కేఆర్కే తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.
ఎక్కువగా బాలీవుడ్ సినీ సెలబ్రిటీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటాడు.ఇప్పటికే గతంలో పలువురు సెలబ్రిటీలపై కామెంట్స్ చేసిన ఆప్షన్ తెలిసిందే.
అదే విషయంలో తీవ్ర విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు.హీరో, హీరోయిన్ లపై తీవ్ర విమర్శలు చేసి అభిమానుల ఆగ్రహానికి లోనైన విషయం తెలిసిందే.
తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.
మరి ముఖ్యంగా సినిమాలకు తనదైన శైలిలో రివ్యూలు ఇస్తూ కొత్త కొత్త వివాదాలకు తెరలేపుతూ ఉంటాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా కెఆర్కే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు.బాలీవుడ్ సినీ విమర్శకుడిగా పేరొందిన ఆయన అసలు పేరు కమల్ ఆర్ ఖాన్.కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో కేఆర్కేగానే ఫేమస్ అయ్యారు.తాజాగా కేఆర్కే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై సినిమా రివ్యూలు చేయనంటూ ట్వీట్ చేశారు.షారూక్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన మూవీ పఠాన్ రివ్యూ తన చివరిదని స్పష్టం చేశారు కెఆర్కే.
కాగా ఈ ట్వీట్ పై స్పందించిన పలువురు నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.అయితే అందుకు గల కారణం కూడా లేకపోలేదు.
గతంలో కూడా ఈ విధంగానే ఇలాంటి ప్రకటనలు చేసి వాటిని మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు కెఆర్కే.పలువురు నెటిజెన్స్ గతంలో కేఆర్కే ఈ విధంగానే ట్వీట్ చేసిన ట్వీట్ లను కామెంట్ రూపంలో పోస్ట్ చేస్తున్నారు.మొత్తానికి కెఆర్కే తాజాగా చేసిన ట్వీట్ తో మరొకసారి వార్తల్లో నిలిచాడు.ఇకపోతే బిగ్ బాస్ 3 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
వెండితెరపై పలు సినిమాలలో నటించినప్పటికీ అతనికి తగిన విధంగా గుర్తింపు దక్కలేదు.సినిమాలు, బిగ్ బాస్ షో కంటె తన రివ్యూ లతో బాగా పాపులర్ అయ్యింది.