తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు సాగాయి.దసరా పండుగను పురస్కరించుకొని వారం రోజుల్లో రూ.1,100 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.అక్టోబర్ 2, 5వ తేదీల్లో రెండు రోజులు మద్యం డిపోలకు సెలవులు ఉండగా, గత ఏడు పని దినాలలో రూ.1100 కోట్లు విలువైన మద్యం విక్రయించడం విశేషం.సెప్టెంబర్ 30న రూ.313 కోట్లకు పైగా అమ్మకాలు సాగినట్లు తెలుస్తోంది.రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ.500 కోట్ల మద్యం అమ్ముడైంది.
తాజా వార్తలు