టాలీవుడ్ నిర్మాత లు తమ సమస్య ల పరిష్కారం కోసం అంటూ గత నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు.ఆగస్టు 1వ తారీకు నుండి షూటింగ్ లను జరపడం లేదు.
ఎట్టకేలకు సెప్టెంబర్ 1 నుండి షూటింగ్ లను పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఇటీవలే దిల్ రాజు ప్రకటించాడు.సెప్టెంబర్ 1 నుండి పెద్ద హీరోలు అంతా కూడా షూటింగ్ లకు సిద్ధం అవుతున్నారు.
మహేష్ బాబు వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.చిరంజీవి వెంటనే తన యొక్క గాడ్ ఫాదర్ షూటింగ్ బ్యాలన్స్ ను ముగించబోతున్నాడు.
అయితే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు అనేది చర్చనీయాంశంగా మారింది.పవన్ కళ్యాణ్ ఇప్పటికే హరి హర వీరమల్లు సినిమా ను సగం లో వదిలేశాడు.
ఆ సినిమా షూటింగ్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.అంతే కాకుండా వినోదయ్య సిత్తం సినిమా రీమేక్ కు కూడా ఓకే చెప్పాడు.
ఆ సినిమా కోసం పవన్ కళ్యాణ్ రెండు నెలల డేట్లు ఇచ్చాడట.
ఆ రెండు నెలల్లోనే సినిమా పూర్తి అవ్వాల్సి ఉంది.
ఈ రెండు సినిమా ల్లో పవన్ ఏ సినిమా ను చేయబోతున్నాడు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.సెప్టెంబర్ 1 నుండి షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటాడు అంటూ మీడియా వర్గాల కు జనసేన పార్టీ నాయకుల ద్వారా సమాచారం అందుతోంది.
జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ దసరా నుండి భారీ ఎత్తున బస్సు యాత్రను నిర్వహించేందుకు సిద్ధం అయ్యాడు.ఆ యాత్ర కు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే షురూ అయ్యాయి.
అయినా కూడా సినిమాలకు సంబంధించిన హడావుడి కూడా కొనసాగబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం మళ్లీ షురూ అవ్వబోతుంది.