మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పిల్ల నువ్వులేని జీవితం సినిమాతో హీరోగా పరిచయం అయ్యి ఒక మోస్తరు హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తర్వాత సుప్రీం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.
సాయి ధరమ్ తేజ్ గత ఏడాది సెప్టెంబర్ లో యాక్సిడెంట్ అయ్యి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ పై సాయి తేజ్ ప్రమాదానికి గురి అవవడంతో ఆసుపత్రిలో చేరాడు.
దాదాపు 35 రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు.ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఈయన కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు.
ఈయన ఇప్పటి వరకు విశ్రాంతి తీసుకుంటున్నాడు.అయితే ఈ రోజుతో ఈయన విశ్రాంతి పూర్తి అయ్యిందనే చెప్పాలి.
ఎందుకంటే సాయి తేజ్ తన కొత్త సినిమా స్టార్ట్ చేసాడు.ఈ రోజు SDT15 స్టార్ట్ అయ్యింది.
ఈ రోజు సాయి ధరమ్ తేజ్ చాలా రోజుల తర్వాత తాజాగా సెట్స్ లోకి అడుగు పెట్టడంతో అందరు ఆయనకు ఘానా స్వాగతం తెలిపాడు.
ఈయన రిపబ్లిక్ సినిమా విడుదలకు ముందు యాక్సిడెంట్ అయ్యింది.ఈ సినిమా సాయి తేజ్ ప్రొమోషన్స్ లేకుండానే రిలీజ్ చేస్తారు.అయితే ఈ సినిమా ఆశించినంత ఫలితం రాలేదు.
ఇక ఎట్టకేలకు ఈయన ప్రాణాలతో పోరాడి మరి కోలుకుని కొత్త సినిమా స్టార్ట్ చేసాడు.
ఈయన యాక్సిడెంట్ తర్వాత సెట్ లో అడుగు పెట్టడంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు.దీంతో సాయి తేజ్ కంటతడి పెట్టుకుని ఎమోషనల్ అయ్యాడు.ఇక ఈ కొత్త సినిమాకు శ్రీ ఏవంకటేస్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై నిర్మిస్తునాన్రు.ఇది థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతుంది.‘SDT15’ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.