ఇటీవల తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడవాలంటే కేంద్రం నిధులే ఆధారమని.
తెలంగాణ ఖజానా గొప్పదనం గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ నిధుల కోసం కేంద్రం వద్ద అడుక్కుంటున్నామా? మరి కేసీఆర్.ప్రతిసారి ఢిల్లీ వెళ్తున్నది బిచ్చమెత్తుకోవటానికి కాదా అంటూ కౌంటర్ కామెంట్లు వేశారు.మీకు కేంద్రంపై కోపం ఉంటే దానిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పై చూపించే అడగడం సరైన విధానం కాదని పేర్ని నాని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.కేంద్రం వద్ద న్యాయబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడుగుతుంది.
అంతేగాని అడుక్కునే పరిస్థితుల్లో రాష్ట్రం లేదని ప్రజా ప్రయోజనాలే మాకు ముఖ్యం అని స్పష్టం చేశారు.ఏది దాచి పెట్టాల్సిన అవసరం లేదని మీ లాగా బయటకు ఎగరేస్తూ లోపలకు వెళ్లి కాళ్ళు పట్టుకునే రకం కాదు.
నిజంగా ధనిక రాష్ట్రమైన తెలంగాణ కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి అని పేర్ని నాని పేర్కొన్నారు.ఇదే రీతిలో.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకులు హైదరాబాద్ నీ.సమిష్టిగా అభివృద్ధి చేయటం బట్ట ఇప్పుడు హైదరాబాద్ నుండి అందుతున్న ఆదాయంతో తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని.పేర్ని నాని తనదైన శైలిలో కామెంట్లు చేశారు.