బద్వేల్ ఉపఎన్నికల ఫలితం ఈరోజు మధ్యాహ్నం లోపు తేలనుంది.ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ లో.
వైసీపీ హవా కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నానికి పూర్తి కానున్నట్లు సమాచారం.ఈ క్రమంలో నాలుగు హాల్స్ లో 28 టేబుల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది.12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది.మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ఆ తర్వాత ఈవీఏం ఓట్లు లెక్కించానున్నారు.

ఈరోజు మధ్యాహ్నం లోగా పూర్తి ఫలితం రానుంది.బాలయోగి గురుకుల పాఠశాలలో 4 గదులలో ఏడు టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది.దీంతో మధ్యాహ్నం లోపు పూర్తి ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
చాలా సర్వేలలో బద్వేల్ ఉపఎన్నికలలో.వైసీపీ గెలవమన్నట్లు ఫలితాలు వచ్చాయి.
ఇలా ఉంటే ఈ ఉప ఎన్నికలలో టీడీపీ, జనసేన పార్టీ లు దూరంగా ఉండగా.జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మరియు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది.
మొత్తంమీద చూసుకుంటే 9 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం లోగా పూర్తయి పూర్తి ఫలితం రానున్నట్లు.సమాచారం.