యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా ప్రేమకథలను తెరకెక్కించే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా లవ్ స్టోరీ.ఈ సినిమా ఎంత మ్యాజిక్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే సూపర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు చైతూ యాక్టింగ్ ఇరగదీశాడని ప్రశంశించారు.
బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ రాబట్టి అందరిని ఆశ్చర్య పరిచింది.కరోనా తర్వాత ప్రేక్షకులను థియేటర్స్ దగ్గరకు తీసుకు వచ్చింది లవ్ స్టోరీ సినిమా.ఇక ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, నాగ చైతన్య జంట అయితే తెర మీద కన్నుల పండుగగా ఉంది.ఇక ఈ సినిమా హిట్ తో లవ్ స్టోరీ టీమ్ అంత సక్సెస్ మీట్లు కూడా జరుపుకున్నారు.
ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ సినిమాను డిజిటల్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.లవ్ స్టోరీ పోస్ట్ ధియేటరికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాను అక్టోబర్ 22 నుండి ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
లవ్ స్టోరీ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్స్ లో విడుదల అయ్యింది.ఇప్పటికి నాలుగు వారాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఓటిటి లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది.ఈ సందర్భంగా ఆహా వారు మరొక కొత్త ట్రైలర్ ను విడుదల చేసారు.
ఈ ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా కట్ చేసారు.ఇక ఇప్పటికి ఈ సినిమాను చూడని వారు ఆహాలో అక్టోబర్ 22 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది కాబట్టి హ్యాపీ గా చూసేయండి.