మనకు ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవి కూడా తన ప్రాణం నిలపుకునేందుకు ఎంతగానో పాకులాడుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది.ఇక పోతే అడవి జీవులు అయితే ఏ మాత్రం కనికరం లేకుండా జీవిస్తుంటాయి.
ఎందుకంటే అలా లేకుంటే తమ ఉనికికే ప్రమాదం వస్తుంది.అందుకే అవి తమ ఎర దొరికితే గనక ఎలాంటి కనికరం చూపించకుండా అత్యంత క్రూరంగా వేటాడుతుంటాయి.
ఇక పోతే ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో కూడా ఇలాగే ఉంటుంది.ఎందుకంటే ఇందులో కూడా ఓ జీవి తన ఎరను అతి క్రూరంగా వేటాడుతుంది.
నిజానికి పాములు జాతుల్లోనే అత్యంత భయంకర జీవిగా పేరు తెచ్చుకుంది కొండచిలువ.దాని వేటకు చిక్కితే గనక ఇంక అంతే సంగతి.ఎందుకుంటే అది ఎంత క్రూరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కాగా దాని నోటికి ఏ జంతువు దగ్గరగా వచ్చినా సరే దాన్ని తన బలమైన శరీరంతో చుట్టేసి తన కడుపులోకి వాటిని మింగేస్తుంది ఈ కొండ చిలువు.
మరి ఇక అది గనక జనావాసాల్లో కనిపిస్తే ఇంకేమయైనా ఉందా ప్రజలు గుండె ఆగిపోతుంది.కాకపోతే విది ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అందుకే అప్పుడప్పుడు ఇది కూడా ఓడిపోయిన సందర్భాలు ఉంటాయి కానీ చాలా తక్కువ.
అయితే ఇప్పుడు ఓ వీడియోలో మాత్రం అటవీ ప్రాంతంలో దర్జాగా తిరిగే కొండచిలువను కొందరు వ్యక్తులు పట్టుకుని దాన్ని వీడియో కూడా తీశారు.ఇక ఈ వీడియోలో ఆ కొండ చిలువకు జింక కళేబరాన్ని ఎరగా వేశారు ఆ వ్యక్తులు.మరి కొండ చిలువకు ఆహారం ముందు పెడితే అది తినకుండా ఉంటుందా ఆ విషసర్పం తన వేగాన్ని వెంటనే చూపించింది.ఆ చనిపోయిన జింక కళేబరాన్ని మొత్తం రెప్ప పాటి వేగంతో తన నోటితో లాక్కుంది.
చూస్తుండగానే అమాంతం మింగేసింది ఆ కొండ చిలువ.ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.