స్టార్ హీరోయిన్ నయనతార పేరు వింటే అభిమానుల మైండ్ లో మొదట ఆమె రెమ్యునరేషన్ గురించే మెదులుతుంది.బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు ధీటుగా ఈ బ్యూటీ రెమ్యునరేషన్ ను తీసుకుంటూ ఉండటం గమనార్హం.
సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులను తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్న ఈ బ్యూటీ ఛాయ్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.ఛాయ్ వాలే అనే పేరుతో ఉన్న చెన్నైకు చెందిన కంపెనీలో నయనతార డబ్బులను ఇన్వెస్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
నయనతారతో పాటు ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.అయితే హీరోయిన్లు తమ బిజినెస్ ఇన్వెస్ట్ మెంట్ల గురించి స్పందించరు కాబట్టి ఈ వార్తలో నిజానిజాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.సినిమాల విషయానికి వస్తే నయనతార నేట్రికన్ అనే సినిమాలో నటించగా మూడో కన్ను పేరుతో ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది.
కరోనా విజృంభణ, ఇతర కారణాల వల్ల థియేటర్లు పూర్తిస్థాయిలో ఓపెన్ కాకపోవడంతో నేట్రిగన్ హక్కులను నిర్మాతలు ఓటీటీకి అమ్మేయగా క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.
ఈ సినిమాకు విఘ్నేష్ శివన్ నిర్మాత కాగా మిలిందా రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో నయనతార కంటిచూపు లేని యువతి పాత్రను పోషిస్తూ ఉండటం గమనార్హం.
బ్లైండ్ అనే సినిమాకు ఈ సినిమా రీమేక్ కాగా ఈ సినిమాతో పాటు విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కాతువాకుల రెండు కాదల్ అనే తమిళ సినిమాలో నయనతార నటిస్తున్నారు.ఈ సినిమాలతో పాటు నయనతార నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండటం గమనార్హం.