తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయ తాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.మొన్నటి వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించిన తెలంగాణ ప్రభుత్వం .
ఇటీవల లాక్ డౌన్ విధించడం జరిగింది.పరిస్థితి ఇలా ఉండగా గాంధీ హాస్పిటల్ లో కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటున్న రోగులకి బిగ్ హెల్ప్ చేసే తరహాలో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
గాంధీ హాస్పిటల్ వద్ద కరోనా రోగులు మరియు వారి బంధువులకు అన్నం దొరకక అనేక అవస్థలు పడుతూ ఉండటం తో సుమారు వెయ్యి మందికి ఉచిత భోజనం అందించటానికి రేవంత్ రెడ్డి రెడీ అయ్యారు.
కాంగ్రెస్ హైకమాండ్ నాయకుల సూచనల మేరకు .లాక్ డౌన్ కారణంగా కరోనా బాధితులకు అన్నం దొరికే పరిస్థితి లేని క్రమంలో .ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినట్టు స్పష్టం చేశారు.అదేవిధంగా కరోనా హాస్పిటల్ లో కనీస సౌకర్యాలు లేవని . కేసీఆర్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.డాక్టర్లకు, నర్సులకు కూడా కనీస ఆహారం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని.రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.అదేవిధంగా హాస్పిటల్ లో రెమెడిషివర్, ఆక్సిజన్, బెడ్స్ కొరత ఉందని పేర్కొన్నారు.