ప్రజలను అలెర్ట్ గా ఉండమంటున్న టాలీవుడ్ బ్యూటీ..!

ఢిల్లీ సోయగం రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఎన్నో చిత్రాలలో నటించి తన కంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.

 Raashi Khanna Wants To Keep People Alert, Raashi Khanna, Covid19, Corona Virus,-TeluguStop.com

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగసౌర్య సరసన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైంది రాశి ఖన్నా.

ఎన్ని సినిమాలు చేసిన ఈ బ్యూటీ మాత్రం స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది.

అందుకోసం ఇప్పటికి శ్రమిస్తూనే ఉంది.ప్రస్తుతం రాశి ఖన్నా చేతినిండా సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ బ్యూటీ ఏ లుక్ లో అయినా ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈమె ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం సినిమాలను లైన్లో పెట్టింది.

అయితే ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమయ్యింది.ముందుకన్నా వేగంగా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది.

కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ కూడా పెట్టింది.ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడు పదే పదే ప్రజలను అలెర్ట్ గా ఉందామంటూ హెచ్చరిస్తుంది.

ఈ ఢిల్లీ బ్యూటీ ప్రజలను ”మాస్క్ పెట్టుకోండి.ఇంట్లోనే ఉండండి.

అప్పుడే మనందరం సురక్షితంగా ఉంటాం” అని చెబుతుంది.అంతేకాదు తాను కూడా మాస్క్ పెట్టుకుని ఇంట్లోనే ఉంటున్నా అంటూ తెలిపింది.

ప్రజలు ఈ సమయంలో అలెర్ట్ గా ఉండాలంటూ సూచిస్తుంది.

ప్రస్తుతం రాశీ చేతిలో దాదాపు ఏడు సినిమాలు ఉన్నట్టు సమాచారం.

తెలుగులో ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో గోపీచంద్ కు జంటగా పక్కా కమర్షియల్ సినిమా, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య కు జంటగా థాంక్యూ సినిమాలో నటిస్తుంది.కోలీవుడ్ లో కూడా ఈ అమ్మడికి వరస అవకాశాలు అందుతున్నాయి.

చూస్తుంటే ఈ అమ్మడు జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube